బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్ర
` భారాసను గంపగుత్తగా భాజపాకు అప్పగించాలన్న ప్రయత్నం జరుగుతోంది
` జైలులో ఉన్నప్పుడే ఆ ప్రతిపాదన వస్తే వ్యతిరేకించా
` ఏ పార్టీలోనూ విలీనం కాకుండా స్వతంత్రంగా ఉండాలన్నదే నా అభిమతం
` లీకు వీరులను ఎండగట్టమంటే నాపై ప్రతాపమా?
` కేసీఆర్కు నోటీసులు ఇస్తే నేతలెవరూ స్పందించకపోతే ఎలా?
` కడుపులో బిడ్డను పెట్టుకుని ఉద్యమంలో పనిచేశా
` నన్ను, కేసీఆర్ను విడదీసే కుట్ర..
` మీడియాతో చిట్చాట్లో కవిత సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్(జనంసాక్షి): భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు తాను అంతర్గతంగా ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా లీక్ అయిందని ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. కట్టడి చేయమంటే పెయిడ్ సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారని ఆరోపించారు. మీడియాతో చిట్చాట్లో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.‘’కేసీఆర్కు నోటీసులు ఇస్తే నేతలెవరూ స్పందించకపోతే ఎలా? నాకు నీతులు చెబుతూ కోవర్టులు ఉన్నారంటున్నారు. నా మీద పడి ఏడిస్తే ఎలా?ఇంటి ఆడబిడ్డ గురించి ఎలా పడితే అలా మాట్లాడిస్తే అది మర్యాదేనా? లిక్కర్ కేసు సమయంలో రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వద్దని వారించారు. ఎంపీగా పోటీ చేస్తే సొంత పార్టీ వాళ్లే కుట్రపూరితంగా ఓడిరచారు. అదే జిల్లాలో ప్రొటోకాల్ ఉండాలని కేసీఆర్ ఎమ్మెల్సీ ఇచ్చారు. లీకు వీరులను ఎండగట్టమంటే నాపై ప్రతాపం చూపుతున్నారు. కాంగ్రెస్, భాజపాపై మాట్లాడాలి కానీ.. నాపై దాడి చేస్తే ఎలా? భారాసను గంపగుత్తగా భాజపాకు అప్పగించాలన్న ప్రయత్నం జరుగుతోంది. జైలులో ఉన్నప్పుడే ఆ ప్రతిపాదన వస్తే నేను వ్యతిరేకించాను. భాజపాలో భారాస విలీనం కాకుండా స్వతంత్రంగా ఉండాలన్నదే నా అభిమతం. నాపై దుష్ప్రచారం చేస్తున్నా పార్టీ స్పందించలేదు. నన్ను పార్టీ నుంచి ఎవరు బయటకు పంపుతారు?.. అంత సీన్ లేదు. కాంగ్రెస్తో సంప్రదింపులు జరిపినట్లు జరుగుతున్న ప్రచారం శుద్ధ అబద్ధం. భారాసలో కేసీఆర్ మాత్రమే నాకు నాయకుడు.. ఆయన నాయకత్వంలోనే పనిచేస్తాను. వెన్నుపోటు పొడవడం నా లక్షణం కాదు… నేరుగానే పోరాడతాను. కొత్త పార్టీ అవసరం లేదు.. ఉన్న పార్టీని బాగా చూసుకుంటే చాలు. లేఖలో నేను చేసిన సూచనల్లో ఒక్కటైనా తప్పుందా? కేసీఆర్ను నడిపించేంత పెద్దవాళ్లు అయ్యారా? కడుపులో విషం పెట్టుకుని బయటకు నవ్వుతూ ఉండలేను. నా తండ్రికి వందల లేఖలు రాశాను.. తప్పేంటి?సాధారణంగా కేసీఆర్ లేఖను చదివాక చింపుతారు. ఈసారి అలా చింపలేదు. కుట్ర ఎవరు చేశారో నాకు తెలియదు… బయటపెట్టాలని అంటున్నాను. లీకు వీరుడా.. లీకు వీరులా? అనేది తెలియాలి.దేశం వెలుపల ఐటీ సెల్లు పెట్టి నాపై పోరాడుతామంటే ఎలా?దొంగల్ని పట్టుకోమంటే చేతగాక నాపై ప్రతాపం చూపితే ఎలా? పార్టీ నాది అని ప్రతి ఒక్కరూ పోరాడితేనే ఫలితం ఉంటుంది. కేసీఆర్కు నోటీసులు ఇస్తే.. కేవలం ‘ఎక్స్’లో పోస్టు పెట్టి వదిలేస్తే ఎలా? నేను ఏనాడూ పదవుల కోసం పోరాడలేదు. కడుపులో బిడ్డను పెట్టుకుని తెలంగాణ ఉద్యమంలో సైనికురాలిగా పనిచేశాను. నన్ను విమర్శిస్తున్న నేతలు కేసీఆర్ నీడన ఉన్నారు తప్ప.. చేసిన కార్యక్రమాలు ఏమున్నాయి? వర్కింగ్ ప్రెసిడెంట్కు ఇవ్వాల్సిన ప్రొటోకాల్.. గౌరవం ఉంటుంది. తెలంగాణ జాగృతి ఉద్యమ సంస్థ.. అది ఇవాళ పుట్టింది కాదు. పార్టీ చేయని కార్యక్రమాలను జాగృతి తరఫున చేస్తున్నాను. సాంస్కృతిక, సమకాలీన అంశాలపై బలంగా పోరాడాం.నా తండ్రిని, నా కుటుంబాన్ని వదిలి నేనెందుకు వెళ్తాను?నా కుటుంబానికి నన్ను దూరం చేసే ప్రయత్నం జరుగుతోంది. దూరం చేస్తే ఎవరికి లాభం జరుగుతుందో ఆలోచించుకోవాలి. నన్ను, కేసీఆర్ను విడదీసే కుట్ర చేస్తున్నారు. నేను ఎవరి నాయకత్వం కింద పనిచేయను.. కేసీఆర్ మాత్రమే నాకు నాయకుడు. దామోదర్రావు, గండ్ర మోహన్రావును ఎవరు పంపారో నాకు తెలియదు. వాళ్లిద్దరూ ఎవరికి దగ్గరో తెలుసు కదా! వేరే నేత అంశంలో స్పందించిన పార్టీ.. నా విషయంలో ఎందుకు స్పందించడం లేదు? భారాస బలహీనమైతే కాంగ్రెస్, భాజపాలకు లాభం చేకూరుతుంది. కేసీఆర్ ఎలాంటి తప్పు చేయలేదు. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు.. అందులో ఎలాంటి అనుమానం లేదు. లోక్సభ ఎన్నికల్లో ఓటమికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి కానీ.. ‘ఎక్స్’లో పోస్టులకు పరిమితమైతే ఎలా?’’ అని కవిత ఘాటుగా వ్యాఖ్యానించారు.