యాక్టివ్‌ కేసులు పైపైకి..

` దేశవ్యాప్తంగా 3,758కి చేరిన కొవిడ్‌ బాధితులు
` తాజా వేరియంట్‌ వ్యాక్సిను సమర్ధవతంగా పనిచేస్తాయి: డబ్ల్యూహెచ్‌వో
` ఇన్ఫెక్షన్‌ తీవ్రత తక్కువే.. అప్రమత్తంగా ఉండాలి: ఐసీఎంఆర్‌
న్యూఢల్లీి(జనంసాక్షి):దేశంలో కొవిడ్‌ వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచిన గణాంకాల ప్రకారం జూన్‌ 1న ఉదయం 8గంటల వరకు దేశ వ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 3,758కి పెరిగింది.వీటిలో అత్యధికంగా కేరళలోనే 1400 కేసులు ఉండగా.. మహారాష్ట్రలో 485, దిల్లీ 436, గుజరాత్‌ 320, పశ్చిమ బెంగాల్‌ 287, కర్ణాటక 238, ఆంధ్రప్రదేశ్‌23, తెలంగాణ 3 చొప్పున.. ఇలా పలు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తంగా 3758 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే, ఈ ఏడాది కొవిడ్‌ సంబంధిత మరణాలు 28కి చేరాయి.కొవిడ్‌ మళ్లీ వ్యాప్తి చెందుతుండటంపై ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇటీవల స్పందించింది. వ్యాప్తిలో ఉన్న ఎల్‌ఎఫ్‌.7, ఎన్‌బీ.1.8.1 సబ్‌ వేరియంట్లను ‘పర్యవేక్షణలో ఉన్న వేరియంట్లు’గా వర్గీకరించింది. పలు దేశాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న ఎన్‌బీ.1.8.1 వేరియంట్‌తో ఇన్ఫెక్షన్ల వ్యాప్తి, ఆస్పత్రుల్లో చేరికలు ఒకేసారి పెరుగుతున్నా.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఇతర వేరియంట్లతో పోలిస్తే ఇది తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుందన్న సూచనలు ఏమీ లేవని మే 23న పేర్కొంది. ఇప్పటికే ఆమోదం పొందిన కొవిడ్‌ వ్యాక్సిన్లు ఈ వేరియంట్‌ లక్షణాలు, ప్రభావాన్ని కట్టడి చేయడంలో సమర్థంగా పనిచేస్తాయని భావిస్తున్నట్లు తెలిపింది.
ఇన్ఫెక్షన్‌ తీవ్రత తక్కువే.. అప్రమత్తంగా ఉండాలి: ఐసీఎంఆర్‌
మరోవైపు, ఐసీఎంఆర్‌ వెల్లడిరచిన సమాచారం ప్రకారం.. దేశంలోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ నమూనాల ద్వారా ఈ కొత్త వేరియంట్లు ఒమిక్రాన్‌ జాతికి చెందిన ఉప రకాలుగా తేలింది. 2022లో ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ శరవేగంగా విస్తరించడానికి ఒమిక్రాన్‌ కారణమన్న విషయం తెలిసిందే. అయితే, ఎల్‌ఎఫ్‌.1, ఎక్స్‌ఎఫ్‌జీ, జేఎన్‌. 1, ఎన్‌బీ. 1.8.1 వంటి వేరియంట్లను మన దేశంలో గుర్తించగా.. వీటిలో మొదటి మూడు వేరియెంట్లే ప్రబలంగా ఉన్నట్లు ఐసీఎంఆర్‌ చీఫ్‌ రాజీవ్‌ బహల్‌ ఇటీవల తెలిపారు.
కొవిడ్‌ కేసుల పెరుగుదలపై ఇటీవల రాజీవ్‌ బెహల్‌ ‘పీటీఐ’వార్తా సంస్థతో మాట్లాడుతూ.. తొలుత దక్షిణ భారతదేశం నుంచి నమోదైన కేసులు.. ఆ తర్వాత పశ్చిమం నుంచి, ఇప్పుడేమో ఉత్తర భారతం నుంచి వస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులన్నింటినీ ఇంటిగ్రేటెడ్‌ డిసీజ్‌ సర్వైలెన్స్‌ ప్రోగ్రామ్‌ ద్వారా మోనిటరింగ్‌ చేస్తున్నామన్నారు. ప్రస్తుతానికి ఈ ఇన్‌ఫెక్షన్ల తీవ్రత తక్కువగా ఉందన్న ఆయన.. ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. ‘’ఎప్పుడైనా ఇన్ఫెక్షన్లు పెరిగితే.. మూడు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వైరస్‌ వ్యాప్తి ఎంత మేరకు ఉంది అనేది మొదట చూడాలి. గతంలో కొవిడ్‌ 19 వచ్చినప్పుడు కేసులు రెండు రోజుల్లోనే రెట్టింపు కావడం మనం చూశాం. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇక రెండోది, కొత్త వేరియంట్లు రోగనిరోధక శక్తిపై ఏమేరకు ప్రభావం చూపుతున్నాయనేది చూడాలి. మూడోది, వైరస్‌ తీవ్రత ఎంతో చూడాలి. గతంతో పోలిస్తే.. ఈ వేరియంట్‌లో అంత తీవ్రత కనబడటంలేదు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదుగానీ, అప్రమత్తంగా, సర్వసన్నద్ధతతో ఉండాలి’’ అని సూచించారు.

తాజావార్తలు