గుడ్ న్యూస్ తగ్గిన ఎల్‌పీజీ గ్యాస్ ధర.. ఏ నగరాల్లో ఎంత ఉందంటే..

న్యూఢిల్లీ: ప్రతీ నెల మాదిరిగానే ఎల్పీజీ సిలిండర్‌ ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండ్‌ ధరలు స్వల్పంగా తగ్గాయి. 19 కిలోల సిలిండర్‌ ధరను రూ.24 మేర తగ్గించినట్లు దేశీయ చమురు కంపెనీలు ప్రకటించాయి. తగ్గిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని వెల్లడించాయి. దీంతో ఢిల్లీలో సిలిండర్‌ ధర రూ.1,723.50కు చేరింది. అదేవిధంగా కోల్‌కతాలో రూ.1826, ముంబైలో రూ.1674.50, చెన్నైలో రూ.1881గా ఉన్నాయి.అయితే గృహ వినియోగదారులకు మాత్రం మరోసారి నిరాశ తప్పలేదు. గృహావసరాలకు వినియోగించే 14 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధరల్లో ఎలాంటి మార్పూ లేదని చమురు కంపెనీలు వెల్లడించాయి. కాగా, కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు గత నెల రూ.14.50 తగ్గిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఏప్రిల్‌ రూ.41 మేర ధరను తగ్గించాయి.

తాజావార్తలు