పట్టాలపై ప్రమాదాలు

` రష్యాలో రెండు రైలు దుర్ఘటనలు
` రైలు వెళ్తుండగా కూలిన వంతెన..
` ఏడుగురి మృతి
` 69 మందికి గాయాలు
` ఇదే తరహాలో కూలిన మరో వంతెన..
` ఘటనలో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు..!
మాస్కో(జనంసాక్షి):రష్యాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రష్యా- ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో ఉన్న బ్రయాన్స్క్‌ ప్రాంతంలో రైలు వెళ్తుండగా వంతెన కూలిపోయింది.ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. 69 మంది గాయపడ్డారు. మాస్కో నుంచి క్లిమోవ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనను స్థానిక గవర్నర్‌ అలెగ్జాండర్‌ ధ్రువీకరించారు. ప్రమాద స్థలంలో అత్యవసర సేవలు కొనసాగుతున్నాయని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
రష్యాలో కూలిన మరో వంతెన.. పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు..!
రష్యాలోని బ్రయాన్స్క్‌లో వంతెన కూలి రైలు బోల్తాపడిన ఘటన చోటు చేసుకుని 24 గంటలు గడవక ముందే.. అలాంటి ప్రమాదమే క్రస్క్‌లో చోటుచేసుకొంది. ఆదివారం తెల్లవారుజామున మరో రైలు వంతెన కూలిపోయింది. దీంతో దానిపై వెళ్తున్న ఓ గూడ్స్‌ రైలు బోల్తాపడిరది. ఈ విషయాన్ని ఆ ప్రాంత గవర్నర్‌ అలెగ్జాండర్‌ కిన్స్‌టెయిన్‌ ధ్రువీకరించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం ఉక్రెయిన్‌ సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉందని పేర్కొన్నారు.శనివారం పశ్చిమ బ్రియాన్స్క్‌ ప్రాంతంలో ఓ వంతెన కూలిపోవడంతో.. ప్రయాణికుల రైలు బోల్తాపడిరది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా.. 69 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని అక్కడి గవర్నర్‌ వెల్లడిరచారు.. ఈ రైలు మాస్కో నుంచి కిల్‌మోవ్‌ ప్రాంతానికి వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో రైలు డ్రైవర్‌ కూడా ఉన్నారు.

తాజావార్తలు