తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని

జూన్ 2, 2025 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ ఏర్పడి నేటితో 11 యేళ్లు పూర్తి చేసుకొని 12వ యేట అడుగుపెట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘ‌నంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంద‌ర్భంగా రాష్ట్ర ప్రజ‌ల‌కి ప‌లువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియ‌జేస్తున్నారు.రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (కేంద్ర మంత్రి అమిత్‌ షా తదితరులు తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా, సాంకేతికంగా అభివృద్ధి సాధిస్తోందని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు పురోగతిలో మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నా అంటూ ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు.

తాజావార్తలు