సాయంత్రం 5 గంటలకు బాధ్యతలు చేపట్టనున్న రాహుల్‌

న్యూఢిల్లీ : రాహుల్‌ గాంధీ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యలయంలో పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. జైపూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ మేధోమథన సదస్సులో పార్టీ ఉపాధ్యక్షుడిగా రాహుల్‌ ఎంపికైన సంగతి తెలిసిందే.