‘ఒక్క సిరీస్‌ ఫలితం మా జట్టు ఫామ్‌ను చూపించదు: వైస్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌

నాగ్‌పూర్‌: ఆ్రస్టేలియాతో ఇటీవల జరిగిన బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో భారత్‌ 1–3 తేడాతో పరాజయం పాలైంది. దాంతో జట్టులో ప్రధాన ఆటగాళ్ల ప్రదర్శనపై పలు రకాల విశ్లేషణలు సాగాయి. సీనియర్ల ఆటపై పలు విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఈ తరహా విమర్శలను వన్డే టీమ్‌ వైస్‌ కెప్టెన్ శుబ్‌మన్‌ గిల్‌ తప్పు పట్టాడు. నిజానికి తాము ఆసీస్‌ గడ్డపై కూడా మెరుగ్గానే ఆడామని, కొద్దిలో ఓటమి పాలయ్యామని అతను వివరించాడు.

‘ఒక్క సిరీస్‌ ఫలితం మా జట్టు ఫామ్‌ను చూపించదు. జట్టులోని కీలక ఆటగాళ్లంతా గతంలో ఎన్నో టోర్నీల్లో నిలకడగా రాణించారు. ఆ్రస్టేలియాతో సిరీస్‌లో మేం అంచనాలకు తగినట్లుగా ఆడలేదనేది వాస్తవం. అయితే మరీ ఘోరంగా విఫలమేమీ కాలేదు. చివరి రోజు బుమ్రా లేకపోవడం దురదృష్టకరం. అతను ఆడితే మేం మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ సమం చేసేవాళ్లం. ఒక మ్యాచ్‌ లేదా ఒక రోజు మా ఆటేంటో చెప్పదు. గతంలో అక్కడ రెండుసార్లు సిరీస్‌ సాధించాం.

తాజావార్తలు