సివిల్‌ రైట్స్‌ డే నిర్వహించిన రెవెన్యూ అధికారులు

కరీంనగర్‌: ధర్మపూరి మండలంలోని నేరెళ్ల గ్రామంలో ఈ రోజు రెవెన్యూ అధికారులు సివిల్‌ రైట్స్‌ డే నిర్వహించారు. జగిత్యాల ఆర్డీవో హనుమంతరావు మాట్లాడుతూ అంటరాని తనం నేరమన్నారు. దీన్ని నిర్మూలించటానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ధర్మపురి తహసీల్ధారు రమేశ్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.