అక్టోబర్ 31 వరకు జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు…… ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి

కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 1( జనంసాక్షి)
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా శనివారం నుండి ఈ నెల 31 వరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి శనివారం తెలిపారు. జిల్లాలో ఎవరైనా పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, బహిరంగ సభలు నిర్వహించరాదని తెలిపారు. చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే వారిపై కేసులు పెట్టకుండా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. పోలీసుల నుండి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. పోలీసుల అనుమతి లేకుండా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన సంబంధిత వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా జిల్లా వాసులను హెచ్చరించారు. ఆయా గ్రామాల ప్రజలు ప్రజా ప్రతినిధులు యువకులు పోలీసువారికి సహకరించాలని కోరారు.