అక్రమంగా దాచిన బియ్యం పట్టివేత

కాకినాడ,ఆగస్ట్‌11(జనం సాక్షి): తుని మండలం, ఎన్‌.సూరవరం పంచాయతీ కొత్త సూరవరంలో సివిల్‌ సప్లై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. నల్లా రాజు అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యాన్ని సీజ్‌ చేశారు. వాటి విలువ సుమారు రూ. 79,400 ఉంటుందన్నారు. నిందితుడు రాజును అదుపులోకి తీసుకుని అతనిపై 6ఏ కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.