అచ్చంపేట డిసిసిబి ఆధ్వర్యంలో రైతులకు రుణాలపై అవగాహన కార్యక్రమం.

జనం సాక్షి న్యూస్: ఉప్పునుంతల,21 సెప్టెంబర్ 2022.
నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండల పరిధిలోని ఉప్పరపల్లి, మరియు ఉప్పునుంతల, గ్రామాల్లో, డిసీసీబీ, మహబూబ్నగర్,వారి ఆదేశానుసారం, అచ్చంపేట, డిసిసిబి వారు, రైతులకు రుణాలపై అలాగే ప్రత్యేకంగా విద్యార్థులకు, ఇచ్చే రుణాలపై మరియు గ్రామాలలో గృహ నిర్మాణానికి సంబంధించిన, రుణాలపై అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా రైతులు తీసుకున్న పంట రుణాలు సకాలంలో వడ్డీ చెల్లించి రెన్యువల్ చేయించిన వారికి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా కలిగే లాభాల గురించి వివరంగా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగిల్ విండో చైర్మన్ సత్తు భూపాల్ రావు, డిసిసిబి మేనేజర్ భూపాల్ రెడ్డి, సంఘ సీఈవో, రవీందర్రావు, ఉప్పర్ పల్లి ,గ్రామ సర్పంచ్, ఇంద్రసేనారెడ్డి, బ్యాంకు సిబ్బంది మరియు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.