అధికారులపై ఎలాంటి ఒత్తిడీ లేదు

వారంతా స్వేచ్ఛగా పనిచేస్తున్నారు.
డిప్యూటీ సీఎం నారాయణస్వామి
చిత్తూరు,ఆగస్ట్‌10(జనంసాక్షి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో కలెక్టర్లు, ఎస్పీలు స్వేచ్ఛగా పని చేస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. ఎవరిపైనా ఒత్తిడి లేదన్నారు. అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించే స్వేఛ్చను కలిగి ఉన్నారని అన్నారు. ఆయన మంగళవారం విూడియాతో మాట్లాడుతూ.. ఐఏఎస్‌, ఐపీఎస్‌లను కించపరిచేలా చంద్రబాబు మాట్లాడారని అన్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల తీరును చంద్రబాబు తప్పుబట్టడం సిగ్గు చేటన్నారు. అధికారులను కించపరిచేలా చంద్రబాబు మాట్లాడారని, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసన్నారు. కలెక్టర్లు, ఎస్పీలను అవమానపరిచే విధంగా చంద్రబాబు తీరు ఉందని వారికి ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి నారాయణస్వామి డిమాండ్‌ చేశారు.