అలంపూర్‌ కోర్టులో హాజరైనా కోదండరాం ,ఈటెల

మహాబూబ్‌నగర్‌ : సడక్‌ బంద్‌ కేసులో తెలంగాణ జేఏసీ కన్వీనర్‌ కోదండరాం, టీఆర్‌ఎస్‌ నేతలు ఈటెల రాజేందర్‌ , జితేందర్‌రెడ్డిలు గురువారం అలంపూర్‌ కోర్టుకు హాజరయ్యారు. హైదరాబాద్‌ -కర్నూల్‌ జాతీయ రహదారిపై తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం టీఆర్‌ఎస్‌ సడక్‌బంద్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వీరు ఆలంపూర్‌ కోర్టుకు వచ్చారు.