అశ్వరావుపేటలో ఇద్దరు దొంగలు అరెస్ట్

పొలాల్లో ట్రాన్స్ఫార్మ్ లే టార్గెట్
– నిందితుల నుండి రాగి వైరు స్వాధీనం చేసుకున్న పోలీసులు
అశ్వరావుపేట అక్టోబర్ 7( జనం సాక్షి ) వరస గా దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అశ్వరావుపేట ఎస్సై అరుణ తమ సిబ్బందితో పట్టుకున్నారు. శుక్రవారం జంగారెడ్డిగూడెం రోడ్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై మూట ఉండటంతో అనుమానంతో తనిఖీ చేశారని, మూటలో రాగి వైరు ఉండటంతో గోపు కిరణ్, పోతురాజు అశోక్, ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సిఐ బాలకృష్ణ విలేకరుల సమావేశంలో తెలిపారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫర్లను బద్దలు కొట్టి విలువైన రాగి వైరు దొంగలించేవారని, దమ్మపేట, బూర్గంపాడు, అశ్వాపురం, జూలూరుపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా ట్రాన్స్ఫరాల్లో ఉన్న రాగి,అల్యూమినియం వైర్లను కూడా దొంగిలించి సొమ్ము చేసుకునేవారని సిఐ తెలిపారు. వారి వద్ద నుండి రు. 1,10, 700 విలువగల రాగి వైరు ను స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. ఒక్కరు పరార్ లో ఉన్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సై లు అరుణ,సాయి కిషోర్ రెడ్డి, సిబ్బంది నాగేంద్రరావు వెంకటేశ్వరరావు లక్ష్మయ్య లు పాల్గొన్నారు.