ఆజాది క అమృత్ మహోత్సవం లో రంగోలి

టేకులపల్లి, ఆగస్టు 20 (జనం సాక్షి ): భారత స్వాతంత్ర వజ్రోత్సవాలలో బాగంగా టేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, కొప్పురాయి గ్రామ పంచాయితీ కార్యాలయంలో శనివారం( రంగోలి )ముగ్గుల పోటీలు నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సెర్ఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలలో విద్యార్థులు పాల్గొనగా ముగ్గుల పోటీలలో గెలుపొందిన విద్యార్థినీలకు స్థానిక తహసిల్దార్ కెవి శ్రీనివాసరావు, ఎంపీడీవో డి బాలరాజు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఏపీవో గాంధీ, ఏపిఎం బండి వినోద్ క్రాంతి ,సర్పంచులు బోడ సరిత, బోడ నిరోషా ,సీసీలు నరేష్ ,సునీల్ పాల్గొన్నారు. అదేవిధంగా కొప్పురాయి గ్రామపంచాయతీ కార్యాలయంలో ముగ్గుల పోటీలతో మహిళలు సంబరాలు జరుపుకున్నారు.అనంతరం ముగ్గుల పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ చింత మంగమ్మ ,ఈసాల ఝాన్సీ, గోగ్గల సమీరా, జార స్వాతి ,జార లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి నాగమణి ,అంగన్వాడి టీచర్ గుగ్గల నరసమ్మ ,జార సరస్వతి తదితరులు పాల్గొన్నారు.