ఆటో డ్రైవర్స్ కు అండగా ఉంటా..

-ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 01 (జనంసాక్షి):
 ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్బంగా సోమవారం తెలంగాణ ఆటో  ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ గారు హాజరై జెండా ఊపి ర్యాలీ ని ప్రారంభించి మరియు జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం ఆటో డ్రైవర్ లనుద్దేశించి మాట్లాడుతూ ఉద్యమనేత ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వం లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు అన్ని విధాల అండగా ఉంటున్నదని,భవిష్యత్ లో ఆటో డ్రైవర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కోసం కృషి చేస్తా, నగరం లోని అన్ని ఆటో అడ్డల లో మౌలిక వసతుల కోసం కృషి చేస్తా, తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం పాటుపడుతున్నదని,లైసెన్స్ బ్యాడ్జ్ ఉన్న ఆటో డ్రైవర్ లు ప్రమాధ వషాత్తు మరణిస్తే 5 లక్షల వరకు భీమా సౌకర్యం కల్పిస్తున్నదని అన్నారు,
కార్యక్రమం లో కార్పొరేటర్ గందె కల్పన,యూనియన్ అధ్యక్షులు వీరాస్వామి,జనరల్ సెక్రటరీ సుధాకర్, ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు