చిన్నారులను విక్రయిస్తున్న గుజరాత్‌ మూఠా అరెస్టు

` ‘సృష్టి’ కేసులో బెయిల్‌పై వచ్చి మరీ దురాగతానికి పాల్పడుతున్నారు
` వివరాలు వెల్లడిరచిన మాదాపూర్‌ డీసీపీ రితు రాజ్‌
హైదరాబాద్‌(జనంసాక్షి): చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను మాదాపూర్‌ డీసీపీ రితు రాజ్‌ విూడియా సమావేశంలో వెల్లడిరచారు. ‘‘గుజరాత్‌ నుంచి చిన్నారులను తీసుకొచ్చి హైదరాబాద్‌, మంచిర్యాలలో విక్రయించారు. దాదాపు 20 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నాం. ముఠాలో సృష్టి ఫెర్టిలిటీ కేసుకు సంబంధించిన నిందితులు ఉన్నట్టు గుర్తించాం. సృష్టి కేసులో బెయిల్‌పై వచ్చి చిన్నారులను విక్రయిస్తున్నారు. ఒక్కో చిన్నారిని రూ.4లక్షల నుంచి రూ.5 లక్షలకు విక్రయిస్తున్నట్టు దర్యాప్తులో తేలింది’’ అని డీసీపీ తెలిపారు.