ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లతో క్రెడిట్‌ కార్డులు ఖాళీ

రికవరీ ఏజెంట్ల వేధింపులతో యువకుడు ఆత్మహత్య

హైదరాబాద్‌,జూలై8(జనం సాక్షి): రాజేంద్రనగర్‌ అత్తాపూర్‌ లో యువకుడు ఆత్మహత్య కలకలం రేపుతోంది. క్రెడిట్‌ కార్డు రికవరీ ఏజెంట్ల వేధింపులు తాళలేక దత్తాత్రేయ అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దత్తాత్రేయ రెండేళ్లుగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు బానిసయ్యారు. అతని వద్ద ఉన్న మూడు క్రెడిట్‌ కార్డుల్లోని డబ్బులతో యువకుడు ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడాడు. దీంతో క్రెడిట్‌ కార్డు డబ్బు కట్టాలంటూ దత్తాత్రేయపై రీకవరీ ఏజెంట్లు ఒత్తిడి తీసుకువచ్చారు. రికవరీ ఏజెంట్ల వేధింపులతో తీవ్ర మనస్థాపం చెందిన దత్తాత్రేయ ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. వడ్డీతో సహా డబ్బులు చెల్లించాలని తనను వేధిస్తున్నారని యువకుడు సూసైడ్‌ లెటర్‌ రాశాడు. విషయం తెలిసిన పోలీసులు ఘటానాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.