ఆర్టీసీ బస్సు-మినీ లారీ ఢీకొని తొమ్మిది మందికి గాయాలు

పెబ్బేరు: పెబ్బేరు సమీపంలో ఈరోజు మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు ,మినీ లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మినీ లారీలో ప్రయాణిస్తున్న తొమ్మిది మందికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని 108లో వనపర్తి ఆసుపత్రికి తరలించారు.