ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు.

దౌల్తాబాద్ అక్టోబర్ 2, జనం సాక్షి.
దౌల్తాబాద్ మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు శాంతియుత అహింస మార్గంలో భారతదేశానికి స్వతంత్రం అందించిన మహాత్మా గాంధీ ఆశయాలను అనుగుణంగా నేటి సమాజం నడవాలని అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి, లాల్ బహుదూర్ శాస్త్రి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పరిశుద్ధ కార్మికురాలు అల్వాల రమ ను పరామర్శించి 50 కేజీల బియ్యం, 5000 రూపాయలు ఆర్థిక సహాయం ఆర్యవైశ్య సంఘం తరఫున అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సయ్యద్ రహిమోద్దిన్,ఏఎంసి డైరెక్టర్ పబ్బ అశోక్,వార్డ్ మెంబర్ మాశెట్టి నరేష్ గుప్తా, గంప రవి,జిల్లా అంజయ్య, పసుపునూరి అంజయ్య, శ్రవణ్, పబ్బ మాధవి, పసుపునూరి పద్మ, మాశెట్టి నవ్య తదితరులు పాల్గొన్నారు.
Attachments area