ఆసరా పింఛన్లు పంపిణీ చేసిన సర్పంచ్

ఝరాసంగం అక్టోబర్ (జనం సాక్షి ) మండలం లోని క్రిష్ణపూర్ గ్రామంలో ఆసరా పింఛన్ కార్డులను సర్పంచ్ అమార్జిత్ పంపిణీ చేశారు. గ్రామంలో ని పంచాయతీ కార్యాలయంలో పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షులు ముసా పటేల్,యూత్ నాయకులు ఆసీఫ్ పటేల్, వార్డు సభ్యులు రవి,సంగన్న, శ్రీకాంత్, ఇస్మాయిల్ మహిళలు గ్రామ పెద్దలు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.