ఇంజనీరింగ్ విద్యార్థుల ధర్నా
భద్రాచలం పోలీసులు తమపై అకారణంగా దాడి చేశారంటూ డాక్టర్ బాల్రాజ్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులుబ్రిడ్జి సెంటర్ వద్ద ధర్నా నిర్వాహించారు. అనంతరం ఏస్పీ కార్యాలయానికి ప్రదర్శనగా విళ్ళారు. అక్కడ ఏఎస్పీ డా. గజరావ్ భూపాల్కు పోలిసుల వైఖరిపై పిర్యాదు చేశారు. ఈ విషయమై విచారణ చేపడతానని ఏఎస్పీ విద్యార్థులకు హమీ ఇచ్చారు.