ఇన్నోవేషన్‌సెంటర్‌గా హైదరాబాద్‌

1

– మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 3(జనంసాక్షి): ఇన్నోవేషన్‌ సెంటర్‌గా హైదరాబాద్‌ ఎదుగుతోందని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇదే కొత్త పరిశ్రమలకు ఊతం ఇస్తోందని అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకారణంగా ఔత్సాహికులుఉత్సాహంగా పనిచేస్తున్నారని అన్నారు. స్టార్టప్‌ కాన్ఫరెన్స్‌ ఆగస్ట్‌ ఫెస్ట్‌ శనివారం నగరంలోని రాయదుర్గం జేఆర్సీ కన్వెన్షన్‌ హాల్‌లో ప్రారంభమైంది. ఈ ఆగస్ట్‌ ఫెస్ట్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టార్టప్‌ పెట్టాలనుకుంటున్నవారికి ఆగస్ట్‌ ఫెస్ట్‌ ఓ మంచి అవకాశమన్నారు. స్టార్టప్‌లకు చక్కని వేదికగా టీ-హబ్‌ ఇంక్యుబేటర్‌ ఉంటుందన్నారు. టీ-హబ్‌ విజయవంతంగా పనిచేస్తోందని తెలిపిన మంత్రి ఇప్పటివరకు 30కి పైగా ఐటీ సంస్థలు హైదరాబాద్‌కు వచ్చాయన్నారు. ఐటీ సంస్థలు తమ సేవలను గ్రావిూణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయని వెల్లడించారు. ఐటీకి హైదరాబాద్‌లో చక్కని మౌలిక సదుపాయాలున్నాయి. ఇక్కడ స్టార్టప్‌కు సంబంధించి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. స్టార్టప్‌తో వచ్చేవారు కొత్త ఐడియాస్‌తో రావాలి. ఇన్నోవేషన్‌ ఐడియాస్‌తో వచ్చేవారికి టీ-హబ్‌ మంచి వేదిక అవుతుందని మంత్రి పేర్కొన్నారు. అలాగే నూతన పారిశ్రామిక విధానం కూడా ఇందుకు దోహదపడుతోంద్నారు.