ఈ నెల 23న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి

ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 19 ఈనెల 23న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధరణి పోర్టల్ ను నిరసిస్తూ కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని అలంపూర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త లక్ష్మీనారాయణరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం మండల పరిధిలోని ఎర్రవల్లి చౌరస్తా లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ధరణి పోస్టర్ వల్ల రైతుల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆయన అన్నారు. అంతేకాకుండా ఒకరి పేరు మీద ఉన్న భూమి మరొకరి పేరు పై ఉండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం ధరణి పోర్ట్ రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలన్నారు. ఇందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ని ముట్టడి చేసేందుకు రైతులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. విలేకరుల సమావేశంలో ఇటిక్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసింహ, మధు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.