ఈ రోడ్డు ప్రయాణం ప్రమాదాలకు నిలయం

అధికారులు తొందరగా రోడ్డు నిర్మాణం చేయ్యాలి

ఎంపిపి మాధవి బాల్ రాజ్ గౌడ్

ఎల్లారెడ్డి 20 సెప్టెంబర్ జనం సాక్షి ఎల్లారెడ్డి మండలంలోని శివనగర్ గేట్ నుండి రుద్రారం గ్రామం వరకు రోడ్డు మీద గుంతలు ఏర్పడడంతో మంగళవారము ఆటో యూనియన్ డ్రైవర్లు గుంతల్లో మోరం పోసి గుంతలు పుడ్చు తుండడం తో ఎల్లారెడ్డి ఎంపీపీ మాధవి బాల్ రాజ్ గౌడ్ అటు వైపు నుండి వెళ్తూ ఆటో యూనియన్ డ్రైవర్లు రుద్రారo రహదారి లో రోడ్డు గుంతల మయంగా వుందని పుడ్చుతుండగా ఎంపిపి అగి వారి తో మాట్లాడారు ఆమె మాట్లాడుతూ శివనగర్ గేటు నుండి గ్రామాలు ప్రజలు ప్రయాణించాలంటే గుంతల రోడ్డుపై నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని ఎంపీపీ మాధవి గౌడ్ కు తెలిపారు ఆటో యూనియన్ డ్రైవర్లకు మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు అయిన అధికారుల అలసత్వంతో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల రోడ్డు నిర్మాణానికి నోచుకోవడం లేదని సంబంధిత అధికారులనిర్లక్ష్యం వల్ల రోడ్డు గుంతల మయంగా అయిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు శివ నగర్ నుండి రుద్రారం గ్రామాల వరకు రోడ్డు దుస్సుతి చూస్తేనే అర్ధం అవుతుంది అని అన్నారు సామాన్యులు ఈ రోడ్డు గుండా ఆటో లోనే ప్రయనించలంటే జంకుతున్నారు గ్రామాల ప్రజలు తప్పని పరిస్తితి లో రోడ్డుపై ప్రయాణిస్తున్నారు మరియు నిత్యవసర సరుకుల కొరకు ఎల్లారెడ్డి మండలానికి అదే విధంగా పాఠశాల విద్యార్థులు ఆటోలలో ద్విచక్ర వాహనదారులు కూడా ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంబంధిత అధికారులు తొందరగా రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆమె అన్నారు