ఉచిత కంటి శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీపీ

అశ్వరావుపేట ఫిబ్రవరి 22 (జనం సాక్షి)

అశ్వరావుపేట పట్టణంలో స్థానిక ప్రభుత్వ పశు వైద్య శాల నందు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శరత్ మ్యక్సివిజన్ సూపర్ స్పషాలిటీ కంటి ఆసుపత్రి హన్మకొండ అలంకార్ సర్కిల్ వరంగల్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరాన్ని అశ్వరావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలకు ఈ ఒక్క ఉచిత కంటి వైద్య శిబిరం బాగా ఉపయోగ పడుతుంది అని రిటైర్డ్ అవిన కూడా మానవ సేవే మాధవ సేవ లా విశ్రాంతి శరీరానికే కానీ మనసుకి కాదు అని ఈ ఉద్యోగులు నిరూపించారని
ఉద్యోగులు అవి కూడా ఇంకా సేవచేయలనే బావన తో ప్రజలకు సేవచేస్తున్నందుకు వారికి ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో, రిటైర్డ్ ఉద్యోగులు సంఘం అధ్యక్షులు , పి. పుల్లయ్య,కార్యదర్శి ఎస్ కె ఫకీర్,ఉపాధ్యక్షులు రాజేంద్రకుమార్ ,డాక్టర్స్ పంచాయతీ సెక్రెటరీ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు .