జై తెలంగాణ నినాదం రాష్ట్ర ప్రజలందరిదీ..
` అది ఏ ఒక్క పార్టీది కాదు
` కేసీఆర్కు నోటీసులు ఓ స్వంత్య్ర దర్యాప్తు కమిషన్.
` దానిపై రాజకీయంగా విమర్శలు చేయడమేంటీ?
` భారాస, భాజపా కలిసి నడుస్తున్నాయని స్వయంగా కవితే చెప్పారు
` ఆమె వ్యాఖ్యలపై ఆయా పార్టీల నేతలే సమాధానం చెప్పాలి: మంత్రి శ్రీధర్బాబు
హైదరాబాద్(జనంసాక్షి): ‘జై తెలంగాణ’ రాష్ట్ర ప్రజల నినాదమని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. ‘జై తెలంగాణ’ నినాదంపై ఒకరు పేటెంట్ ఏమీ తీసుకోలేదన్నారు.ఇది ఓ పార్టీకి సంబంధించిన నినాదం కాదని స్పష్టం చేశారు. ‘’ కేసీఆర్కు నోటీసులు ఇచ్చింది కాళేశ్వరంపై వేసిన ఓ దర్యాప్తు కమిషన్. స్వతంత్ర దర్యాప్తు కమిషన్ను రాజకీయంగా విమర్శించడం ఏంటి? భారాస, భాజపా కలిసి నడుస్తున్నాయని కవిత చెప్పారు.అదే మాట గతంలో మేం చెప్తే.. భారాస, భాజపా నేతలు హడావుడి చేశారు. ఆ రెండు పార్టీల మధ్య బంధాన్ని కేసీఆర్ కుమార్తె స్వయంగా చెప్పారు. కవిత వ్యాఖ్యలపై భాజపా, భారాస నాయకులు సమాధానం చెప్పాలి.’’ అని శ్రీధర్బాబు డిమాండ్ చేశారు.