5న కాదు.. 11న కేసీఆర్ విచారణ తేదీ మార్పు
` ఆయన అభ్యర్థన మేరకు మార్చిన కాళేశ్వరం కమిషన్
హైదరాబాద్(జనంసాక్షి): కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరుకావాల్సిన తేదీ మారింది. ఈనెల 11న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు ఆయన హాజరుకానున్నారు. కేసీఆర్ విజ్ఞప్తి మేరకు విచారణ తేదీని కాళేశ్వరం కమిషన్ మార్చింది. తొలుత ఈనెల 5న విచారణకు కేసీఆర్ హాజరుకావాల్సి ఉండగా.. తాజాగా 11కి మార్చారు.కాగా అంతకుముందు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం కమిషన్ ఎదురుగా విచారణకు ఈ నెల 5వ తేదీన హాజరు కావడం లేదని స్పష్టం చేశారు. ఈ నెల 11వ తేదీన హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. అయితే, విచారణకు మరింత సమయం కావాలని కవిూషన్ చైర్మన్ పీసీ ఘోష్ ను ఆయన కోరినట్లు తెలుస్తుంది. ఇప్పటికే, ఈ విషయాన్ని కాళేశ్వరం కమిషన్ కు సమాచారం అందజేశారు. గులాబీ బాస్ కోరిక ప్రకారం ఈ నెల 11వ తేదీన విచారణకు వచ్చేందుకు కాళేశ్వరం కమిషన్ అంగీకరించింది. అయితే, మరోవైపు, ఇవాళ తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు విూద చేపట్టిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా వాయీదా వేశారు. ఈ నెల 9వ తేదీన కవిూషన్ ముందు హాజరు కానున్నారు.. అలాగే, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా కాళేశ్వరం కమిషన్ ఛైర్మన్ పీసీ ఘోష్ ముందు విచారణకు వెళ్లనున్నారు. ఇక, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుపై విచారణ కమిషన్ వేసింది. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన కాళేశ్వరం కమిషన్ విచారణ దాదాపుగా తుది దశకు చేరుకుంది. కాగా, ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేసిన హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన ఈటెల రాజేందర్ కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులను ఇప్పటికే అందజేసింది.ఈనెల 5వ తేదీన విచారణకు రావాలని కాళేశ్వరం కమిషన్ ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఈ విచారణకు మరింత సమయం కావాలని కమిషన్ ఛైర్మన్ను కేసీఆర్ కోరినట్లు- సమాచారం. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరుకావడంపై ఆయన సుదీర్ఘ ఆలోచనలు చేస్తున్నట్లు- తెలుస్తోంది.హరీష్రావు హాజరు తర్వాత పరిణామాలను బేరీజు వేసుకుని ఈనెల 11న విచారణకు వెళ్లాలా, వద్దా? అనే విషయంపై కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు.