ఉద్యమ నాయకుడే సీఎం కావడం

  మన అదృష్టం
పాలమూరు ఎత్తిపోతల పూర్తయితే 1.50లక్షల ఎకరాలకు సాగునీరొస్తుంది
పేదల సంక్షేమనాఇకి 40వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అద్భుత పథకాలు
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి
మహబూబ్‌నగర్‌, జూన్‌7(జ‌నం సాక్షి) : ఉద్యమ నాయకుడే సీఎం కావడం మన అదృష్టమని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. జిల్లాలోని జడ్చర్ల అసెంబ్లీ పరిధిలోని మిడ్జిల్‌ మండలం వల్లబ్‌రావ్‌పల్లిలో రూ. 3 కోట్లతో నిర్మించిన వివిధ అభివృద్ధి పనులను గురువారం మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలకు ప్రజలపైన చిత్తశుద్ధి లేదన్నారు. పేదల సంక్షేమానికి 40 వేల కోట్ల నిధుల ఖర్చు చేస్తున్నామన్న మంత్రి.. పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తయితే 1,50,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని నాశనం చేస్తున్నది. గత 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్‌ ప్రజలకు చేసిందేవిూ లేదు. ప్రాజెక్టులు కట్టనీయకుండా కోర్టులో కేసులు వేస్తున్నారు. వాళ్లను తరిమికొట్టండి. అభివృద్ధికి పార్టీలకతీతంగా కలిసి రావాలి. రైతు బీమా ద్వారా ప్రతి రైతుకు రూ. 5 లక్షల ఇన్సూరెన్స్‌ ప్రభుత్వం చెల్లిస్తున్నదని మంత్రి తెలిపారు. సీఎం సహా తానుసైతం నాడు తెలంగాణ కోసం పదవీ త్యాగాలు చేశామని, పదవుల కోసం పాకులాడలేదని, తెచ్చిన తెలంగాణ తెర్లు కాకుండా, సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్నామన్నారు. అందులో భాగంగానే అనేక అద్భుత పథకాలు తెలంగాణలో అమలు అవుతున్నాయన్నారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన-రైతు బంధు పథకం కింద పంటల పెట్టుబడి చెక్కులు ఎలా ఉందంటూ ప్రశ్నించారు. రైతులు సంతోషం వ్యక్తం చేశారు. పంటల పెట్టుబడి పథకం దేశంలోనే అదర్శంగా నిలిచిందన్నారు. స్వాతంత్యం అనంతరం ఒక్కసారి కూడా భూప్రక్షాళన జరగలేదన్నారు. గతంలో నిజాం కాలంలో ఒకసారి భూ ప్రక్షాళన జరిగిందన్నారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన ప్రతీ పథకం అద్భుతంగా ఉన్నాయన్నారు. తెలంగాణ అభివృద్ధిలో నెంబర్‌ వన్‌ గా ఉందన్నారు. అయితే, నాడు తెలంగాణ పోరాటానికి నాయకత్వం వహించిన కేసీఆరే సీఎం అవడం, ఆయనకు రాష్ట్రం మొత్తం సమస్యల విూద అవగాహన ఉండటం వల్ల అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. బంగారు తెలంగాణ సాధించి తీరుతామని చెప్పారు. నాడు ఉద్యమం సమయంలో కేసీఆర్‌ మాట విూద తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశామన్నారు. అలాగే కేసీఆర్‌ సైతం అనేక సార్లు పదవీ త్యాగం చేశారని చెప్పారు. తామేనాడూ పదవుల కోసం పాకులాడలేదన్నారు. త్యాగాల పునాదుల విూదే తెలంగాణ సాధించామని వివరించారు. అనంతరం మంత్రి కళ్యాణ లక్ష్మీ, రైతు బంధు చెక్కులను పంపిణీ చేశారు. భూ ప్రక్షాళన కార్యక్రమంపై రైతులకు వివరించారు. ఇంకా సమస్యలుంటే వాటిని దశల వారీగా పరిష్కరిస్తామని రైతులకు చెప్పారు. చెక్కులు రాలేదని ఏ ఒక్క రైతు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు.