ఉపాధ్యాయురాలి దారుణ హత్య

మహబూబ్‌నగర్‌ : న్యూటౌన్‌ వెంకటేశ్వరనగర్‌లో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు జులేఖా బేగం దారుణ హత్య కు గురైంది. జులేఖా ముఖం, కళ్లల్లో యాసిడ్‌ పోసి దుండుగులు హత్య చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. కోనపాల మూరు ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలిగా జులేఖాబేగం పనిచేస్తున్నారు.