ఉప ప్రణాళిక పై ఓయూలో విద్యార్థుల హర్షం

హైదారాబాద్‌ : ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించాలన్న అసెంబ్లీ తీర్మానంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ప్రణాళిక తయారీలో కీలకపాత్ర పోషించిన ఉప ముఖ్యమంత్రి దామోదర్‌ రాజనర్సింహాకు విద్యార్థులు అభింనందనలు తెలిపారు. ఆర్ట్స్‌ కళాశాల వద్ద టపాసులు పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి వీసీ ప్రో. సత్యనారాయణ హాజరై సంఘీభావం తెలిపారు.