ఉస్మానియాలో విద్యార్థుల బంద్‌

హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి):ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థి సంఘాలు ఇచ్చిన బంద్‌ కొనసాగుతోంది. పీహెచ్‌ డీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి నేతలు
ఆందోళనకు దిగారు. పాత పద్ధతిలోనే నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేయలని కోరుతున్నారు. ఉస్మానియా యూనివర్శిటీ వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు ఓయూలోని అన్ని విభాగాల క్లాసులను బైకాట్‌ చేయించారు. బంద్‌ లో భాగంగా ఓయూలోని పరిపాలన భవనం, ఆర్ట్స్‌ కళాశాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. యూనివర్శిటీలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకున్నారు.