ఎడ్లను అపహరించిన గుర్తు తెలియని వ్యక్తులు: ఎస్సై జగదీష్

దంతాలపల్లి అక్టోబర్ 10 జనం సాక్షి
ఎడ్లు అపహారణకు గురైన సంఘటన మండలంలోని దాట్ల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే స్థానిక ఎస్సై కూచిపూడి జగదీష్ కథనం ప్రకారం గ్రామానికి చెందిన ఎస్కే బషీర్ తన రెండు ఎడ్లను ఎప్పటిలాగే గ్రామ శివారులో గల తన వ్యవసాయ క్షేత్రంలోని దొడ్డి వద్ద ఈనెల 9న కట్టేసి సోమవారం ఉదయం తన దొడ్డి వద్దకు వెళ్లి చూడగా అవి కనబడక పోవడంతో పరిసర ప్రాంతాల్లో వెతికినా దొరకలేదని, ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించినారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.