ఎలిమినేడు ప్రాథమిక పాఠశాలలో ఘనంగా

కృష్ణాష్టమి వేడుకలు

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి) లోక కళ్యాణం కోసం భువిపై అవతరించిన శ్రీమన్నారాయణుడు.. శ్రీ కృష్ణ భగవానుడి జన్మదినం సందర్భంగా  కృష్ణాష్టమిని పురస్కరించుకొని ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఎలిమినేడు గ్రామంలో  ని ప్రాథమిక పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు చిన్నారులు కృష్ణుడు గోపికమ్మ వేషధారణలతో చేసిన నృత్యాలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమణ ,ఉపాధ్యాయులు ప్రణతి, రమ్య, సంయుక్త, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు