ఎస్ఆర్కే స్కూల్లో స్కూల్ లెడ్ కాన్ఫరెన్స్

ముఖ్య అతిథిగా హాజరైన ఎస్సై ప్రవీణ్ కుమార్
భీమదేవరపల్లి మండలం అక్టోబర్ (22)
జనంసాక్షి న్యూస్
భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు ఎస్ఆర్కే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో “లీడ్” ఆధ్వర్యంలో స్కూల్ లెడ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముల్కనూర్ ఎస్సై ప్రవీణ్ కుమార్ హాజరైనారు. ఈ సందర్భంగా ఎస్సై ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు చిన్నతనంలోనే ప్రాజెక్టు వర్క్, మెటీరియల్స్ తో స్కూల్ లెడ్ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉత్తమమైన విద్యను అందించాలని అన్నారు. స్కిల్ బేస్డ్, నాలెడ్జ్ బేస్డ్, రెస్పెక్ట్ బేస్డ్ విద్య విద్యార్థులలో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందిస్తుందని అన్నారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ కాశిరెడ్డి ఆదిరెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు లీడ్ కరికులం ద్వారా విద్యార్థులకు నర్సరీ నుండే ఆధునిక టెక్నాలజీ ద్వారా జాతీయ స్థాయి విద్యను అందిస్తున్నామని అన్నారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకొని వారి పిల్లలను ఉన్నత స్థితిలో చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో లీడ్ ట్రైనర్ ఐశ్వర్య, కోఆర్డినేటర్ శ్వేత, మరియు అధ్యాపక బృందం కవిత, మానస, సిక స్రవంతి, మాడుగుల స్రవంతి, స్వాతి, దీప్తి, శ్రావణి, రవళి పాల్గొన్నారు.
Attachments area