ఎస్సీ కమిటీ హాల్ భూమి పూజ

జుక్కల్ సెప్టెంబర్ 20,( జనంసాక్షి)
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం సవరగావ్ లోమంగళవారం ఎస్సీ కమిటీ హాల్ కు ఆ గ్రామ
సర్పంచ్ కిషన్ పవర్ భూమి పూజ చేశారు. ఎస్సీ కమిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే హన్మంత్ షిండే
సిడిపి నిధుల నుండి 5 లక్షల రూపాయలు మంజూరు చేశారని సర్పంచ్ తెలిపారు. ఈసందర్భంగా సర్పంచ్ తోపాటు ఆగ్రామ దళితులు
ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డుమెంబర్లు, దళితులు, గ్రామప్రజలు పాల్గొన్నారు.