ఏపీలో పెరిగిన కరోనా కేసులు, మరణాలు

కొత్తగా 1,433 మందికి పాజిటివ్‌
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రవైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 68,041 శాంపిల్స్‌ పరీక్షించగా. 1,433 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 15 మంది కరోనా బాధితులు కన్నుమూశారు.. ఇదే సమయంలో 1,815 మంది కోవిడ్‌ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్‌.. ఇక, తాజా కేసులతో కలుపుకొని.. రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,97,102కు చేరగా.. 19,67,472 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.. ఇక, ఇప్పటి వరకు కోవిడ్‌తో మృతిచెందినవారి సంఖ్య 13,686 కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 15,944 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్‌.