ఏ టి డబ్ల్యూ ఓ కార్యాలయం మంజూరు చేసిన మంత్రి సత్యవతి రాథోడ్

 

ఎంపీపీ బి.రాణీబాయి రామారావు.

మహదేవపూర్ సెప్టెంబర్ 22 (జనంసాక్షి)

మహదేవపూర్ మండలానికి ఏ టి డబ్యు ఓ కార్యాలయం మంజూరు చేసిన రాష్ట్ర గిరిజన సంక్షమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కు, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా కు ఎంపీపీ బి రాణీ బాయి రామారావు కృతజ్ఞతలు తెలిపారు.. సబ్ డివిజన్ కేంద్రమైన మహాదేవపూర్ లోని మాడా కార్యాలయంలో . డి టి డబ్ల్యూ ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి కి విజ్ఞప్తి చేయగా వెంటనే ఏ టి డబ్ల్యూ కార్యాలయాన్ని మంజూరు చేశారని ఎంపీపీ రాణీ బాయి రామారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహాదేవపూర్, పలిమెల , కటారం మలహార్, మహా ముత్తరం మండలాల్లోని గిరిజనుల సంక్షేమం, వసతి గృహాల నిర్వహణ, ఆశ్రమ పాఠశాలల పర్యవేక్షణ కోసం మహాదేవపూర్ లో ఏ టి డబ్ల్యూ ఓ కార్యాలయం ఏర్పాటు చేశారని ఎంపీపీ పేర్కొన్నారు. అడిగిన వెంటనే ఏ టి డబ్ల్యూ ఓ కార్యాలయాన్ని మంజూరు చేసిన రాష్ట్ర గిరిజన మంత్రి సత్యవతి రాథోడ్ కు, సహకరించిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా కు ఎంపీపీ కృతజ్ఞతలు తెలిపారు