ఐఐటీలో సీటు సాధించిన విద్యార్థులకు

కేసముద్రం సెప్టెంబర్ 28 జనం సాక్షి / మండలంలోని శ్రీ వివేకవర్ధిని హై స్కూల్ పూర్వ విద్యార్థులైన దారావత్ బాలాజీ,భూక్య మహేష్ లు ఐఐటి ఫలితాలలో అత్యుత్తమ ర్యాంకు సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఐఐటి వారణాసి లో సీటు సాధించిన దారావత్ బాలాజీ (ఆల్ ఇండియా  441 ర్యాంక్) , కేరళ రాష్ట్రంలోఎన్ఐటి తిరుచి లో సీటు సాధించిన భూక్య మహేష్ లను బుధవారం పాఠశాల ఆవరణలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ కష్టపడి చదివితే ఉన్నత స్థానాలకు చేరుకోవడం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.