ఓర్వలేక విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలు : ఎంపీ కవిత

dc-cover-rojui89bvlrpl22smhuv77tkf2-20160701203145-mediనిజామాబాద్: జిల్లాలో పార్లమెంట్ సభ్యురాలు కవిత పర్యటిస్తున్నారు. బోధన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ… కాంగ్రెస్ నేతలది జన ఆవేదన సభ కాదు. దిగ్విజయ్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, షబ్బీర్‌అలీ ఆవేదన సభ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే పనిగట్టుకుని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. రెండేళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి కాంగ్రెస్ నేతలకు కనబడటం లేదా అని ప్రశించారు. విపక్ష నేతల అసత్య ప్రచారాలకు స్పందించాల్సిన అవసరం లేదు. దిగ్విజయ్‌సింగ్‌కు తెలంగాణ రాష్ట్రంపై అవగాహన లేదన్నారు.

293