కలల సాకారానికి శ్రమించండి అబ్దుల్‌కలాం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 4 (జనంసాక్షి):
కలలు కనండి.. సాకారం కోసం శ్రమించండి అని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం పిలుపునిచ్చారు. సోమవారంనాడు ఎల్బీ స్టేడియంలో లీడ్‌ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్‌ కలాం, సిబిఐ జెడీ లక్ష్మీనారాయణ, తదితరులు హాజరయ్యారు. విద్యార్థులతో అబ్దుల్‌ కలాం ప్రతిజ్ఞ చేయించారు. ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం హర్షదాయకమన్నారు. ప్రభుత్వం, సమాజం గుర్తించే స్థాయికి విద్యార్థులు ఎదగాలన్నారు.
ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని సూచించారు. అప్పుడే చదువు కున్న విద్యకు సార్ధకత చేకూరుతుందన్నారు. లీడ్‌ ఇండియా ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకుని మరింత ఎదగాలని అభిలాషించారు.