భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి

ధర్మపురి జగిత్యాల జిల్లా జులై06(జనంసాక్షి) : భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా ధర్మపురి బిజెపి పట్టణ అధ్యక్షులు గాజు భాస్కర్ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.
నిజమైన దేశభక్తుడు నిర్భయ నాయకుడు ఒకే దేశం కోసం అమరుడైన మహానుభావుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 06 జూలై 1901 జన్మించడం జరిగింది. ఆయన జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రత్యేక హోదా ఆర్టికల్ 370 కి వ్యతిరేకంగా నిరాసనగ అక్కడి అనుమతి పత్రం పర్మిట్ లేకుండా ప్రవేశించినందుకు విచారణ లేకుండానే జైల్లో నిర్బంధించారు రెండు ప్రధానులు రెండు జెండాలు ఉండలేవని ఒకే దేశం ఒకే చట్టం కోసం పోరాడి అమరుడైన మహానుభావులు.ఇట్టి కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గాజుభాస్కర్. జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి బెజ్జారపు లవన్ ,పట్టణ బిజెపి ప్రధాన కార్యదర్శిలు తిరుమందాస్ సత్యనారాయణ, సంఘీ మాధవ్, ఎండోమెంట్ జిల్లా కో కన్వీనర్ కాలకోట రాజు, పట్టణ ఉపాధ్యక్షులు వెలగందుల ప్రణీత్ ,బాకీ అనిల్ , తోట శ్రీనివాస్,బీజేవైఎం నాయకులు మండలోజీ సూరజ్, కోశాధికారి సంఘీ రాజేష్, సోమిశెట్టి శివ సాయి,పుదరి పవన్ , ఆప్పం వెంకటేష్, సోషల్ మీడియా ఇన్ఛార్జి కా శెట్టి హరీష్ తదితరులు పాల్గొన్నారు



