*కల్వకుంట్ల సుజిత్ రావుకు ఘన సన్మానం*

మెట్పల్లి టౌన్ , సెప్టెంబర్ 27 :
జనం సాక్షి
టీపీసీసీ నూతనంగా రాష్ట్రంలో సీనియర్ నాయకుడు కల్వకుంట్ల సుజీత్ రావును టీపీసీసీ డెలిగేట్స్ గా నియమించిన సందర్భంగా మెట్ పల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం ఘనంగా సన్మానించారు. మొదటినుంచి ఎంతో విశ్వాసంతో పార్టీకి పనిచేస్తూ, పార్టీ బలోపేతానికి , కోరుట్ల నియోజకవర్గంలో కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలనే ఎప్పటికి అప్పుడు ఎండగడుతూ ప్రశ్నిస్తూ పార్టీ ఆదేశానుసారం నడుచుకుంటూ కార్యక్రమాలు చేస్తున్నటువంటి కోరుట్ల నియోజకవర్గ మొగిలిపేట ముద్దు బిడ్డ సుజిత్ రావును పూలమాలలు శాలువాలతో సత్కరించారు. వారి నాయకత్వంలో పార్టీని మరింత బలపరుస్తూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని, ఈ నియామకానికి సహకరించిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, నదీమ్ జావిద్, రేవంత్ రెడ్డి, మాధుయాష్కీ గౌడ్, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబులకు నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మహ్మద్ కుతుబొద్దిన్ పాషా, నాయకులు ఏఆర్ అక్బర్, రుత్త నారాయణ, రాజేందర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.