కల్వకుర్తిలో వివాహితపై గ్యాంగ్‌ రేప్‌

బాధిత మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు

నాగర్‌కర్నూల్‌,జూన్‌19(జ‌నం సాక్షి): జిల్లాలోని కల్వకుర్తిలో వివాహితపై సామూహిక అత్యాచారం కలకలం రేపింది. కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో రాత్రి నలుగురు పోకిరిలు ఓ వివాహితను బలవంతంగా చెరపట్టి అత్యాచారం చేశారు. ఈ ఘటనను ప్రతిఘటించిన బాధితురాలు డయల్‌ 100కు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలిసి జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌, జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.