కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, బతుకమ్మ చీరలు పంపిణీ.

 పాల్గొన్న వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్.

మర్పల్లి, సెప్టెంబర్ 30 (జనం సాక్షి) శుక్రవారం రోజున మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మండలానికి చెందిన 21 మంది లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, మరియు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఆడబిడ్డల సంక్షేమం కోసం ఆదర్శవంతమైన పథకాలను ప్రవేశ పెడుతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో   ఎంపీపీ బంటు లలితా రమేష్, జడ్పిటిసి మధుకర్, వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి,  రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నాయక్ గౌడ్, ఎంపీడీవో జనార్దన్ రెడ్డి, తహశీల్దార్ శ్రీధర్, సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.