కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు .

జనంసాక్షి దండేపల్లి అక్టోబర్ 12దండేపల్లి మండలానికి చెందిన 19 మందికి 19,02204 లక్షల కళ్యాణ లక్ష్మీ చెక్కులను
బుధవారం మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడపిల్ల తల్లిదండ్రులకు పెళ్లి భారం కాకుడదన్న ఉద్దేశ్యం తోనే సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టి పేదలకు అండగా.నిలిసిందన్నారు.అలాగే కాన్పు సమయంలో‌ అంగన్ వాడీల‌ ద్వారా పాలు, గుడ్లు, మంచి భోజనాన్ని గర్భిణీ స్త్రీలకు పోషకాహార రూపంలో అందజేస్తున్నామని ప్రసవ‌సమయంలో ప్రభుత్వాసుపత్రి లో కాన్పు చేస్తే పన్నెండు‌‌ వేల రూపాయల.కేసీఆర్‌కిట్టు,అందజేస్తున్నామన్నారు.ఈ పథకం తెలంగాణ ప్రభుత్వం ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం.శ్రీనివాస్.వైస్ ఎంపీపీ .పసర్తి అనిల్. టిఆర్ఎస్ మండల అధ్యక్షులు చుంచు.శ్రీనివాస్ .ప్రధాన కార్యదర్శి. బండారు. వెంకటేష్.నాయకులు. మోటపలుకుల .గురువయ్య.బండారు.మల్లేష్ .బొలిశెట్టి. రమేష్.కాసనగొట్టు.లింగన్న.ఇప్ప కిష్టయ్య. తదితరులు పాల్గొన్నారు