కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీకి నివాళులు ….

కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్2 (జనంసాక్షి);
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయలొ పట్టణ కాంగ్రెస్,యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు  రాజు. పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గు డుగ్గుల శ్రీనివాస్. కామారెడ్డి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఐ రేని   సందీప్  మాట్లాడుతూ,భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి మహాత్మ గాంధీ ఆంగ్లేయులతో అహింసా పద్ధతిలో పోరాటాలు చేసి స్వాతంత్రాన్ని సిద్ధింపచేసిన గొప్ప వ్యక్తిని మనం భారతదేశంలో ఇంత స్వాతంత్రంగా తిరగగలుగుతున్నామంటే  మహాత్మా గాంధీ  చేసిన త్యాగపలాలే. ప్రస్తుతము మన భారతీయులందరూ మహాత్మా గాంధీ చూపిన పద్ధతిలో  నడుస్తూ, భారతదేశాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లవలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలోసీనియర్ కాంగ్రెస్ నాయకులు కారం గుల అశోక్ రెడ్డి, కౌన్సిలర్లు అన్వర్ హైమద్, మాజీ కౌన్సిలర్లు షేరు, గోనె శ్రీనివాస్, జొన్నల నర్సింలు, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు సిరజుద్దీన్, రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శిసర్వర్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు పుట్నాల శ్రీనివాస్, పంపరి లక్ష్మణ్, దోమకొండ శ్రీనివాస్, శంకర్, హోసన్న, ఏజాజ్, లక్క పతిని గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.