కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతి

కోదాడ టౌన్ అక్టోబర్ 02 ( జనంసాక్షి )
కోదాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ  పట్టణ అధ్యక్షులు వంగవీటి రామారావు ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను బస్టాండ్ సెంటర్లో ప్రధాన రహదారిపై ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పి సి సి రాష్ట్ర కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీ నారాయణ రెడ్డి హాజరై గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ పాత్ర కీలకమన్నారు జాతిపిత మహాత్మా గాంధీ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మార్గంలో నడవాలని అన్నారు సత్యం అహింస ధర్మం అనే మార్గంలోనే చివరివరకు నడిచారని తెలుపుతూ అందుకే జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వర్ధంతి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా చేసుకోవడం జరుగుతుందన్నారు.దేశాభివృద్ధికి గాంధీజీ ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వంగవీటి రామారావు,డిసిసి ఉపాధ్యక్షుడు పారా సీతయ్య, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కందుల కోటేశ్వరరావు ,కౌన్సిలర్లు షాబుద్దీన్,గంధం యాదగిరి,కర్రీ సుబ్బారావు, చింతలపాటి శ్రీనివాసరావు,ఆవు దొడ్డి ధనమూర్తి, బషీర్,బాల్ రెడ్డి,బాగ్దాద్,బాజాన్,పాలూరి సత్యనారాయణ,కంపాటి శ్రీను,బజాన్,షమీ,గార్లపాటి వీరారెడ్డి,బాబా,శోభన్,రజనీకాంత్,సైది బాబు, దాదావలి,ముస్తఫా,దావల్ తదితరులు పాల్గొన్నారు..
Attachments area