కామారెడ్డి సమీపంలో రోడ్డు ప్రమాదం

p8j5y79eనిజామాబాద్ : కామారెడ్డి మండలం రామేశ్వర్‌పల్లి బైపాస్‌ రోడ్డు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టావేరా వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని గాంధీకి తరలించారు. హైదరాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే కొడుకు వివాహానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు పోషెట్టి, ఆనంద్‌పటేల్, బోజిరావ్‌ పటేల్‌గా గుర్తించారు.