కాలనీ వాసులు అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించుకోవడం అభినందనీయము ; సుధీర్ రెడ్డి

ఎల్బీ నగర్ ( జనం  సాక్షి )        మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ పరిధిలోని శ్రీ బాలాజీ నగర్ కాలనీలో శ్రీ పోచమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కార్యక్రమానికి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి  ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అమ్మవారికి  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాలాజీ నగర్ కాలనీలో  4 వేల గజాల స్థలంలో పార్కు అభివృద్ధికి నిధులు మంజూరు అయ్యాయని ప్రకటించారు.
ఇప్పటికే కాలనీకి రూ.32 లక్షలతో బీటీ రోడ్డు, రూ.20 లక్షలతో డ్రైనేజీ పనుల కు టెండర్లు పూర్తి అయ్యాయని, త్వరలొనే పనులు ప్రారంభం అవుతాయన్నారు. లెవల్స్ కలవని ప్రాంతంలో ప్రత్యేకంగా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని, వరద నీటి సమస్య కూడా తొలగిస్తామని పేర్కొన్నారు.
కాలనీ వాసులు అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించుకోవడం అభినందనీయమన్నారు. దేవాలయ నిర్మాణ దాత శివ ప్రసాద్, విగ్రహ దాత ఎం. ప్రభాకర్ లను అభినందించారు. . కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, ,కాలనీ అధ్యక్షుడు గోగుల మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అయితగోని శ్రీనివాస్, కాలనీ పెద్దలు జి. కొండారెడ్డి, ఎం. ప్రభాకర్, పరిశురాం రెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్రవణ్, సురేష్,  నాయకులు అనంతుల రాజిరెడ్డి, జక్కిడి రఘు వీర్ రెడ్డి, పోచబోయిన జగదీష్ యాదవ్, చెన్నగొని శ్రీధర్ గౌడ్, కటికరెడ్డి అరవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.